

2020-21 ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాలు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ పార్లమెంటు లో శుక్రవారం ఆర్థిక సర్వే 2020-21 ని సమర్పించారు. కోవిడ్ యోధులకు అంకితం చేసిన ఈ ఆర్థిక సర్వే 2020-21 తాలూకు ప్రధానాంశాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:
- కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక మందగమనానికి కారణమైంది. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే కూడా మరింత తీవ్రమైన స్థాయి లో నమోదైంది.
- లాక్ డౌన్ ల అమలు, ఒకరికి మరొకరికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలి అనేటటువంటి నియమాలు అప్పటికే నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ ను నిశ్చలమైందిగా మార్చివేశాయి.
- ప్రపంచ ఆర్థిక ఉత్పాదన 2020వ సంవత్సరం లో 3.5 శాతం మేరకు పతనం కావచ్చనేది ఒక అంచనా. (ఐఎమ్ఎఫ్ 2021 జనవరి లో వెల్లడించిన అంచనాల మేరకు)
- ప్రపంచం అంతటా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు వాటి ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ను ఇవ్వడానికి గాను పాలిసీ రేటులను తగ్గించడం, తదితర వివిధ విధానపరమైన నిర్ణయాలను ప్రకటించాయి.
- భారతదేశం కట్టడి, ద్రవ్యపరమైన, ఆర్థిక పరమైన, దీర్ఘకాలికమైన, వ్యవస్థాపరమైన సంస్కరణలతో కూడినటువంటి ఒక చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించింది.
- లాక్ డౌన్ కాలంలో బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం తో పాటు, లాక్ డౌన్ ఉపసంహరణ దశ లో వినియోగాన్ని, పెట్టుబడిని ప్రోత్సహించడానికి గాను, ద్రవ్యపరమైనటువంటి, ఆర్థిక విధానం పరమైనటువంటి మద్దతు ను అందించడం జరిగింది.
- వ్యవస్థ లో తగినంతగా నిధులు అందుబాటు లో ఉండేటట్లుగా చూడటానికి, రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనాన్ని అందించడానికి, అదే సమయంలో విత్త విధాన ఫలితాల సాధన కు వీలు గా ఒక సానుకూల ద్రవ్య విధానాన్ని అనుసరించడమైంది.
- ఎన్ఎస్ఒ ముందస్తు అంచనాలను బట్టి చూస్తే, భారతదేశం జిడిపి వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం లో -7.7 శాతం మేరకు ఉండవచ్చు. కాగా, ఇదే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం లో 23.9 శాతం మేరకు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది.
- భారతదేశం వాస్తవిక జిడిపి 2021-22 ఆర్థిక సంవత్సరం లో 11.0 శాతం వృద్ధి ని నమోదు చేసే సూచన ఉంది. సాంకేతిక జిడిపి 15.4 శాతం మేరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తే అత్యధిక స్థాయి కాగలదు.
- కోవిడ్-19 టీకా మందు కార్యక్రమం పురోగమించే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయి కి చేరుకొనే క్రమం లో రికవరీ పుంజుకొనేందుకు ఆస్కారం ఉంది.
- ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతులు.. ఈ రెండు వృద్ధి మరింతగా క్షీణించిపోకుండా చూశాయి. మరోపక్క పెట్టుబడి, ప్రైవేటు వినియోగం దీనిని కిందకు లాగాయి.
- 2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం లో అంతక్రితం సంవత్సరం కంటే 17 శాతం మేరకు ప్రభుత్వ వినియోగం అధికం గా ఉండవచ్చన్న అంచనా ఆధారం గా రికవరీ కి దన్ను లభించవచ్చు.
- 2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం లో ఎగుమతులు 5.8 శాతం మేరకు, దిగుమతులు 11.3 శాతం మేరకు తగ్గవచ్చని అంచనా వేయడమైంది.
- 2021 ఆర్థిక సంవత్సరంలో జిడిపి లో 2 శాతం మేరకు కరెంటు ఖాతా మిగులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. 17 ఏళ్ళ అనంతరం ఇటువంటి స్థితి ఏర్పడనుంది.
- సరఫరా కోణంలో నుంచి చూస్తే, స్థూల విలువ జత కలసిన (జివిఎ) వృద్ధి 2021 ఆర్థిక సంవత్సరానికి -7.2 శాతం గా ఉంటుందని ఆశించడమైంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.9 శాతం గా ఉండింది.
- వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి ని సాధించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం బారి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
- 2021 ఆర్థిక సంవత్సరం లో పారిశ్రామిక రంగం 9.6 శాతం మేరకు, సేవల రంగం 8.8 శాతం మేరకు క్షీణించవచ్చని అంచనా.
- వ్యవసాయ రంగం లో స్థితి ఆశాజనకంగా ఉండగా, కాంటాక్ట్ ఆధారిత సేవల రంగం, తయారీ రంగం, నిర్మాణ రంగం తీవ్రం గా దెబ్బ తిని తరువాత క్రమంగా కోలుకొంటూ వస్తున్నాయి. వ్యవసాయ రంగం ఉత్తమమైన పరిణామాలను ఆవిష్కరించింది.
- 2020-21 ఆర్థిక సంవత్సరం లో భారతదేశం లో పెట్టుబడులు పెట్టడానికి అనేక వర్గాలు మొగ్గు చూపాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) పెద్ద స్థాయి లో తరలి వచ్చాయి.
- నికర ఎఫ్పిఐ ప్రవాహాలు 2020 నవంబరు లో 9.8 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు నమోదయ్యాయి. ఒక నెల రోజుల కాలం లో ఇంత భారీ స్థాయి లో నికర ఎఫ్పిఐ ప్రవాహాలు నమోదు కావడం ఇదివరకు ఎన్నడూ లేదు.
- 2020వ సంవత్సరం లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) ఎక్విటీ రూపం లో వాటి పెట్టుబడులతో భారతదేశానికి తరలి వచ్చాయి. ప్రవర్థమాన విపణులలో ఈ ఘనత ను సాధించిన ఒకే ఒక దేశం భారతదేశమే.
- సెన్సెక్స్, నిఫ్టీ సూచీ లు పెల్లుబికి, భారతదేశం లో మార్కెట్ క్యాప్ టు జిడిపి రేశియో 2010వ సంవత్సరం అక్టోబరు తరువాత 100 శాతాన్ని మించడం ఇదే మొట్టమొదటిసారి.
- ఇటీవల వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ) లో తగ్గుదల చోటు చేసుకొని, అంత క్రితం ఆహార ద్రవ్యోల్బణం పై ప్రభావాన్ని చూపిన సరఫరా సంబంధిత అవరోధాలకు స్వస్తి పలికిన విషయాన్ని స్పష్టం చేసింది.
- 2020-2021 ప్రథమార్థం లో పెట్టుబడులలో 29 శాతం క్షీణత ఉండగా, ద్వితీయార్థానికి వచ్చే సరికి ఆ క్షీణత 0.8 శాతానికి పరిమితం అయింది.
- రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య రవాణా వ్యవస్థ తిరిగి పుంజుకోవడం తో నెలవారీ జిఎస్టి వసూళ్ళు రికార్డు స్థాయి లో నమోదయ్యాయి. ఈ పరిణామం పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అయినట్లు సూచిస్తున్నది.
- మరోపక్క 2020-2021 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జిడిపి లో 3.1 శాతం స్థాయి లో కరెంటు ఖాతా మిగులు నమోదు అయింది.
- సేవల రంగం లో ఎగుమతులు వేగవంతమై, డిమాండు తగ్గిపోయిన కారణంగా దిగుమతుల (వాణిజ్య సరళి దిగుమతులలో 21.2 శాతం క్షీణత) తో పోలిస్తే ఎగుమతులు (వాణిజ్య సరళి దిగుమతులలో 39.7 శాతం క్షీణత) తగ్గాయి.
- జీడీపీ లో నిష్పత్తి పరంగా విదేశీ రుణం 2020 మార్చి నెలాఖరు కు 20.6 శాతం గా ఉన్నది కాస్తా 2020 సెప్టెంబర్ చివరి నాటికి 21.6 శాతానికి పెరిగింది.
- 2020 డిసెంబర్ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. రాబోయే 18 నెలల దిగుమతులకు తగినంతగా ఉన్నాయి.
- విదేశీ మారక ద్రవ్య నిల్వలలో వృద్ధి తో విదేశీ కరెన్సీ మరియు స్వల్పకాలిక రుణం తాలూకు నిష్పత్తి మెరుగైంది.
- ‘వి‘ (V) ఆకారం లో రికవరీ నమోదు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యుత్తు కు డిమాండు పెరగడం, ఇ-వే బిల్స్, జిఎస్టి వసూళ్ళు, ఉక్కు వినియోగం, వగైరా అంశాలు పురోగతి సూచకాలు గా ఉన్నాయి.
- ఆరు రోజుల వ్యవధి లో 10 లక్షల టీకాలను ఇప్పించడం ద్వారా భారతదేశం ఈ విషయం లో అత్యంత వేగవంతమైన దేశం గా పేరు తెచ్చుకొంది. అంతేకాదు, ఇరుగు పొరుగు దేశాలకు, బ్రెజిల్ కు టీకా మందు ను సరఫరా చేస్తున్న పెద్ద దేశం గా కూడా భారత్ నిలిచింది.
- 2020 సమయంలో వసతి ద్రవ్య విధానం: మార్చి 2020 నుండి రెపో రేటు 115 బిపిఎస్ తగ్గించబడింది
- 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యత ఇప్పటివరకు మిగులులో ఉంది. ఆర్బిఐ వివిధ సంప్రదాయ మరియు అసాధారణమైన చర్యలను చేపట్టింది:
o బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు
o దీర్ఘకాలిక రెపో ఆపరేషన్లు
o లక్ష్య ఆధారిత సుదీర్ఘ కాల రెపో ఆపరేషన్స్ - షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2020 మార్చి చివరి నాటికి 8.21% నుండి 2020 సెప్టెంబర్ చివరి నాటికి 7.49% కి తగ్గింది
- 2020-21 ఆర్ధిక సంవత్సరంలో తక్కువ పాలసీ రేట్ల డిపాజిట్ మరియు రుణ రేట్ల ద్రవ్య ప్రసారం మెరుగుపడింది
- జనవరి 20, 2021 న నిఫ్టీ -50 మరియు బిఎస్ఇ సెన్సెక్స్ వరుసగా 14,644.7 మరియు 49,792.12 రికార్డులను సాధించాయి.
- ఐబిసి ద్వారా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల రికవరీ రేటు (ప్రారంభమైనప్పటి నుండి) 45% పైగా ఉంది
- ధరలు మరియు ద్రవ్యోల్బణం
– హెడ్లైన్ సిపిఐ ద్రవ్యోల్బణం:
– 2020 ఏప్రిల్-డిసెంబరులో సగటున 6.6% మరియు 2020 డిసెంబరులో 4.6% వద్ద ఉంది. ఇది ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల (2019-20లో 6.7% నుండి 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 9.1% వరకు కూరగాయల ధరలు పెరిగాయి)
– సిపిఐ హెడ్లైన్ మరియు దాని ఉప సమూహాలు 2020 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో ద్రవ్యోల్బణాన్ని నమోదుచేశాయి. కొవిడ్ -19 లాక్డౌన్ వల్ల కలిగే ప్రారంభ అంతరాయాల కారణంగా ధరల వేగం గణనీయంగా పెరిగింది.
-సానుకూల ఉప ప్రభావంతో పాటు చాలా ఉప సమూహాలకు నవంబర్ 2020 నాటికి మోడరేట్ ధరల వేగం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సహాయపడింది - నవంబర్ 2019 నుండి, సిపిఐ-పట్టణ ద్రవ్యోల్బణం సిపిఐ-గ్రామీణ ద్రవ్యోల్బణంతో అంతరం తొలగించబడింది
o ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు దాదాపుగా కలుస్తుంది
o సిపిఐ యొక్క ఇతర భాగాలలో ఇంధనం మరియు కాంతి, దుస్తులు మరియు పాదరక్షలు, ఇతరాలు మొదలైన వాటిలో గ్రామీణ-పట్టణ ద్రవ్యోల్బణంలో విభేదిస్తోంది.
o 2019 ఏప్రిల్-డిసెంబర్, అలాగే ఏప్రిల్-డిసెంబర్, 2020-21 మధ్యకాలంలో సిపిఐ-సి ద్రవ్యోల్బణం యొక్క ప్రధాన చోదకం ఆహార మరియు పానీయాల సమూహం:
o 2019 ఏప్రిల్-డిసెంబర్ సమయంలో 53.7% తో పోలిస్తే 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో సహకారం 59% కి పెరిగింది.
o జూన్ 2020 మరియు నవంబర్ 2020 మధ్య థాలి ఖర్చు పెరిగింది. అయితే డిసెంబర్ నెలలో పదునైన పతనం అనేక ముఖ్యమైన ఆహార వస్తువుల ధరల తగ్గుదలను ప్రతిబింబిస్తుంది - రాష్ట్ర వారీగా ఉన్న ప్రభావం:
o ప్రస్తుత సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో సిపిఐ-సి ద్రవ్యోల్బణం పెరిగింది
o ప్రాంతీయ వైవిధ్యం కొనసాగుతుంది
o జూన్-డిసెంబర్ 2020 లో ద్రవ్యోల్బణం రాష్ట్రాలు / యుటిలలో 3.2% నుండి 11% వరకు ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో (-) 0.3% నుండి 7.6% వరకు నమోదయింది. - సూచికలోని ఆహార పదార్థాల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆహార ద్రవ్యోల్బణం మొత్తం సిపిఐ-సి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
- ఆహార పదార్థాల ధరలను స్థిరీకరించడానికి తీసుకున్న చర్యలు:
o ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించడం
o ఉల్లిపాయల స్టాక్పై పరిమితి విధించడం
o పప్పుధాన్యాల దిగుమతులపై పరిమితిని తగ్గించడం - బంగారం ధరలు:
o కొవిడ్-19 ప్రేరేపిత ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మారారు.
o ఇతర ఆస్తులతో పోలిస్తే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బంగారం చాలా ఎక్కువ రాబడిని కలిగి ఉంది - దిగుమతి విధానంలో స్థిరత్వం అవసరం:
o ఆహార నూనెల దిగుమతులపై ఎక్కువ ఆధారపడటం దిగుమతి ధరలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
o దేశీయ ఆహార నూనెల మార్కెట్ ఉత్పత్తి మరియు ధరలను ప్రభావితం చేసే దిగుమతులు, పప్పుధాన్యాలు మరియు ఆహార నూనెల దిగుమతి విధానంలో తరచూ మార్పులతో పాటు, రైతులు / ఉత్పత్తిదారులలో గందరగోళం మరియు దిగుమతులను ఆలస్యం చేస్తుంది - సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ మార్పు
- విధానాలు, పథకాలు మరియు కార్యక్రమాలలో ఎస్డిజిలను ప్రధాన స్రవంతిగా చేయడానికి భారతదేశం అనేక చురుకైన చర్యలు తీసుకుంది
- సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి హై-లెవల్ పొలిటికల్ ఫోరం (హెచ్ఎల్పిఎఫ్) కు స్వచ్ఛంద జాతీయ సమీక్ష (విఎన్ఆర్) సమర్పించబడింది.
- 2030 అజెండా కింద లక్ష్యాలను సాధించే లక్ష్యంతో ఏదైనా వ్యూహానికి ఎస్డిజిల స్థానికీకరణ చాలా ముఖ్యమైనది
o అనేక రాష్ట్రాలు / యుటిలు ఎస్డిజిల అమలు కోసం సంస్థాగత నిర్మాణాలను సృష్టించాయి మరియు ప్రతి విభాగం మరియు జిల్లా స్థాయిలో మెరుగైన సమన్వయం మరియు కలయిక కోసం నోడల్ విధానాలను రూపొందించాయి. - కొవిడ్-19 మహమ్మారి సంక్షోభం ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యూహం ప్రధానమైనది
- వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఐపిసిసి) కింద ఎనిమిది జాతీయ మిషన్లు వాతావరణ ప్రమాదాలపై అనుసరణ, ఉపశమనం మరియు సంసిద్ధత యొక్క లక్ష్యాలపై దృష్టి సారించాయి.
- భారతదేశం యొక్క జాతీయంగా నిర్ణయించిన చర్యలు (ఎన్డిసీ) వాతావరణ మార్పులపై చర్యకు ఆర్ధికం ఒక కీలకమైన సహాయకారి అని పేర్కొంది
- అందువల్ల దేశం గణనీయంగా లక్ష్యాలను పెంచేటప్పుడు ఫైనాన్సింగ్ పరిగణనలు చాలా కీలకంగా ఉంటాయి
- అభివృద్ధి చెందిన దేశాల వాతావరణ ఫైనాన్సింగ్ కోసం 2020 సంవత్సరం నాటికి 100 బిలియన్ డాలర్లను సంయుక్తంగా సమీకరించే లక్ష్యం అస్పష్టంగానే ఉంది
- కాప్26 ను 2021 కు వాయిదా వేయడం కూడా 2025 తరువాత లక్ష్యాన్ని తెలియజేయడానికి చర్చలు మరియు ఇతర సాక్ష్య-ఆధారిత పనులకు తక్కువ సమయం ఇస్తుంది.
- ప్రపంచ బాండ్ మార్కెట్లలో మొత్తం వృద్ధి ఉన్నప్పటికీ, 2020 మొదటి అర్ధభాగంలో గ్రీన్ బాండ్ల జారీ 2019 నుండి మందగించింది. బహుశా కొవిడ్-19 ప్రభావ ఫలితం ప్రస్తుతం కొనసాగుతుండడం అందుకు కారణం కావొచ్చు.
- ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది – ‘వరల్డ్ సోలార్ బ్యాంక్’ మరియు ‘వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్’-కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా సౌర శక్తి విప్లవాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.
- వ్యవసాయం, ఫుడ్ మేనేజ్ మెంట్
- కోవిడ్ -19 కారణంగా విధించింన లాక్డౌన్ కారణంగా ఏర్పడిన వ్యతిరేకత ఉన్నప్పటికీ దేశ వ్యవసాయ అనుబంధ రంగాలు 2020-21 స్థిర ధరల వద్ద 34.4 శాతం పురోగతిని సూచించింది. ( తొలి ముందస్తు అంచనాలు)
- వ్యవసాయం అనుబంధరంగాల వాటా దేశంలో స్థూల విలువ జోడింపులో 2019-20 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద 17.8 శాతం గా ఉంది. ( సి.ఎస్.ఒ- జాతీయ ఆదాయ ప్రాథమిక అంచనాలు .29 మే 2020)
- జివిఎ కు సంబంధించి గ్రాస్ కాపిటల్ ఫార్మేషన్ (జిసిఎఫ్) 2013-14 లో 17.7 శాతం గా ఉండగా 2018-19 సంవత్సరంలో అది 16.4 శాతానికి 2015-16 లో అది 14.7 శాతానికి పడిపోయి హెచ్చుతగ్గులను సూచించింది.
- 2018-19 వ్యవసాయ సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (నాలుగవ ముందస్తు అంచనాల ప్రకారం ) 11.44 మిలియన్ టన్నులు. ఇది 2018-19 కంటే ఎక్కువ.
- వాస్తవ వ్యవసాయ రుణ సరఫరా 2019-20లో రూ 13,50,000 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా రూ 13,92,469.81 కోట్లు సరపరా జరిగింది. 2020 నవంబర్ 30 నాటికి రూ 9,73,517.80 కోట్ల రూపాయలను 2020 నవంబర్ వరకు పంపిణీ చేయడం జరిగింది.
- 2020 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రకటన అనంతరం ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ లో భాగంగా పాల సహకారసంఘాలకు చెందిన 1.5 కోట్ల డైరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు సమకూర్చేందుకు లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది
- 2021 జనవరి మధ్య నాటికి మొత్తం 44,673 కిసాన్ క్రెడిట్ కార్డులు ( కెసిసిలు) మత్స్యకారులు, మత్స్యరైతులకు జారీ చేయడం జరిగింది. అదనంగా 4.04 లక్షల దరఖాస్తులు క్రెడిట్ కార్డుల జారీ కోసం బ్యాంకుల వద్ద వివిధ దశలలో ఉన్నాయి.
- ప్రధానమంత్రి పసల్ బీమా యోజన ఏటికేడాది 5.5 కోట్ల రైతుల దరఖాస్తులను కవర్చేస్తుంది.
- 2021 జనవరి 12 నాటికి 90,000 కోట్ల రూపాయల క్లెయిమ్లు పరిష్కరించడం జరిగింది.·
-సత్వర క్లెయిమ్ సెటిల్మెంట్ నేరుగా రైతుల ఖాతాలలోకి ఆధార్ లింకేజ్ ద్వారా పంపడం జరుగుతోంది.
-దీనిద్వారా 70 లక్షల మంది రైతలు ప్రయోజనం పొందారు. 8741.30 కోట్ల రూపాయల మేరకు కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో వారి ఖాతాలకు బదలీ చేయడం జరిగింది.
-2020 డిసెంబర్లో పి.ఎం -కిసాన్ పథకం కింద 7 వ విడత ఆర్ధిక ప్రయోజనం కింద 9 కోట్ల మంది రైతు కుటుంబాల వారికి వారి ఖాతాలలో 18,000 కోట్ల ర ఊపాయలు డిపాజిట్ చేయడం జరిగింది.
-2019-20 సంవత్సరంలో మత్స్య ఉత్ప్ త్తి రికార్డు స్థౄయిలో 14.16 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది.
-మత్స్యరంగం జివిఎ దేశ ఆర్ధిక వ్యవస్థకు 2,12,915 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది దేశ మొత్తం జివిఏ లో 1.24 శాతం, వ్యవసాయ జివిఎ లో 7.28 శాతం.
-2018-19తో అంతమైన 5 సంవత్సరాల కాలానికి చూసినపుడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 2011-12 ధరలతో పోల్చినపుడు వ్యవసాయరంగంలో 3.12 శాతం, తయారీ రంగంలో 8.25 శాతంతో సగటు వార్సిక వృద్ధి రేటు (ఎఎజిఆర్) 9.99 కలిగి ఉంది. - ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన:
–2020 నవంబర్ వరకు 80.96 కోట్ల మంది లబ్ధిదారులకు ఎన్.ఎఫ్.ఎస్.ఎ నిర్దేశిత అవసరాలకు మించి ఉచితంగా ఆహారధాన్యాలు అందించడం జరిగింది.
-200 లశ్రీోల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. /దీనివల్ల 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. - -ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజ్ : ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద నాలుగు నెలల కాలానికి ( మే నుంచి ఆగస్టు వరకు) ప్రతి నెలకు ఐదు కేజిల వంతున సుమారు 8 కోట్ల మంఇ వలసకూలీలకు ( ఎన్ ఎఫ్.ఎస్ ఎ కింది మినహాయించిన లేదా రాష్ట్ర రేషన్ కార్డు కింద మినహాయించిన వారి కి రేషన్ అందించడం జరిగింది. ఇందుకు సంబంధించిన సబ్సిడీ మొత్తం సుమారు యరూ య3109 కోట్ల రూపాయలు.
- పరిశ్రమ, మౌలిక సదుపాయాలు
– ఐఐపి డాటా ప్రకారం బలమైన వి ఆకారపు ఆర్ధిక కార్యకలాపాల రికవరీ దృవీపకరింపబడింది.
-ఐఐపి, ఎనిమిది కీలకరంగాల ఇండెకస్ కోవిడ్ ముందస్తు స్థాయికి ముందుకు వెళ్లింది.
– ఐఐపిలో స్థూల రికవరీ నవంబర్ 2020 లో (-) 1.9 శాతం ఉండగా 2019 నంబంర్లో గ్రోత్ రేట్ 2.1 శాతంగా ఉంది. 2020 ఏప్రిల్లో ఇది (-) 57.3 శాతం
– ప్రభుత్వం మూలధన వ్యయం పెంచడంతో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత మెరుగు పడ్డాయి. వాక్సినేషన్ కార్యక్రమం, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సంస్కరణలు ఊపందుకున్నాయి.
– ఆత్మనిర్భర్భారత్భియాన్ను ఇండియా జిడిపిలో 15 శాతం మొత్తంతో ఉద్దీపన ప్యాకేజ్ని ప్రకటించడం జరిగింది.
– 2019 కి సంబంధించి సులభతర వాణిజ్యం విషయంలో ఇండియా ర్యాంకు 2018లో 77 గా ఉండగా 2020లో ఇది 63వ ర్యాంకుకు ఎగువకు పాకింది. దీనిని డూయింగ్ బిజినెస్ రిపోర్టు వెల్లడించింది.
-ఇండియా తన స్థాయిని పది సూచికలలో 7 సూచికల విషయంలో మెరుగుదల కనబరచింది.
– బాగా మెరుగుపడుతున్న దేశాలలో ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. వరుసగా మూడవ సారి ఈ గుర్తింపు పొందింది. మూడు సంవత్సరాల వ్యవధిలో 67 ర్యాంకుల మెరుగుదల సాధించింది.
– 2011 తర్వాత మరే దేశమూ ఇంతటి భారీ మెరుగుదల ను సాధించలేదు.
-విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 2020 ఆర్ధిక సంవత్సరంలో 49.98 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. 2019 ఆర్ధిక సంవత్సరంలో ఇది 44.37 బిలియన్ అమెరికన్ డాలర్లు.
2021 ఆర్థిక సంవత్సరానికి 30.0 బిలియన్ అమెరికన్ డాలర్లు (2020 సెప్టెంబర్ వరకు )
-ఎఫ్డిఐ బల్క్ ఈక్విటీ ఫ్లో తయారీ యేతర రంగంలో ఉంది.
-తయారీరంగంలో తిరిగి ఆటోమొబైల్స్,టెలికమ్యూనికేషన్,మెటలర్జికల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, కెమికల్ ఇతర ఫర్టిలైజర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం , నాచురల్ గ్యాస్ రంగాలలో బల్క్ ఎఫ్.డి.ఐ లు వచ్చాయి.
– ఆత్మనిర్భర్ భారత్ కింద తయారీ రంగ సామర్ధ్యం, ఎగుమతులు పెంచేందుకు ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)ను పది కీలక రంగాలకు ప్రకటించింది.
– దీనిని సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేస్తాయి. దీని మొత్తం వ్యయ అంచనా 1.46 లక్షల కోట్ల రూపాయలు, దీనికి ఆయా రంగాలకు ప్రత్యేకంగా ఆర్ధిక పరిమితులు ఉన్నాయి
-దీనిని 146 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంబంధిత మంత్రిత్వశాఖ ల ఆధ్వర్యంలో ఆయారంగాల ప్రత్యేక ఆర్ధిక పరిమితులతో దీనిని అమలు చేస్తారు - సేవల రంగం:
- ఇండియా సేవల రంగం 2020-21 ఆర్ధిక సంవత్సరం తొలి అర్థ సంవత్సరంలో సుమారు 16 శాతం వరకు తగ్గుదల కనిపించింది కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధింపు, కాంటాక్ట్ తీవ్రత స్వభావం కలిగినది కావడంతో ఈ తగ్గుదల కనిపించింది
-సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, రెయిల్ ఫ్రయిట్ ట్రాఫిక్, పోర్టు ట్రాఫిక్, వంటివి అన్నీ వి షేప్ రికవరీని సూచిస్తున్నాయిలాక్డౌన్ సమయంలో ఇవి భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత పుంజుకుంటున్నాయి.
-అంతర్జాతీయంగా వివిధ రంగాలలో ఒడుదుడుకులు ఏర్పడినప్పటికీ ఇండికు సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక అద్భుతంగా పెరిగింది ఇది ఇయర్ ఆన్ ఇయర్ కు సంబంధించి 2020 ఏప్రిల్ -సెప్టెంబర్ కు 236 బిలియన్డాలర్లకు చేరుకుంది
-భారతదేశజివిఎలో సేవల రంగం 54 శాతానికి పైగా ఉంటుంది. భారతదేశంలో ఐదింట నాలుగువంతుల మేరకు భారత్లోకి వస్తున్న ఎఫ్డి.ఐ ఈరంగానికి చెందినదే.
-జివిఎ సెక్టర్షేరు 33 రాష్ట్రాల కు గాను 15 రాష్ట్రాలలో 50 శాతానికి మించి ఉంది.ఢిల్లీ , చండీఘడ్లలో ఇది 85 శాతం కంటే ఎక్కువ ఉంది.
-మొత్తం ఎగుమతులలో సేవల రంగం 48 శాతం,ఇటీవలి కాలంలో సరకు ఎగుమతులు అద్భుత పనితీరు ను కనబరుస్తున్నాయి.
-షిప్పింగ్ రంగం మంచిపనితీరు కనబరుస్తోంది. వీటిలో టర్న్రౌండ్ టైమ్ 2010లో 4.67 రోజులు ఉండగా 2019-20 నాటికి ఇఇది 2.62 రోజులకు తగ్గింది.
-భారతీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ అద్భుతంగా పురోగమిస్తున్నది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలోనూ ఇవి పురోగమిస్తున్నాయి. 38 యూనికార్న్లు ఉన్నాయి.గత ఏడాది రికార్డు సంఖ్యలో 12 స్టార్టప్లు యూనికార్న్ జాబితాలో చేరాయి.
– గడచిన ఆరు దశాబ్దాలలో భారతదేశ అంతరిక్ష రంగం అద్భుత అభివృద్ధిని సాధించింది.
–2019-20 సంవత్సరంలో అంతరిక్ష కార్యక్రమానికి 1.8 బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించడం జరిగింది.
– అంతరిక్ష రంగంలో పలు విధానపరమైన సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు రంగానికి అవకాశంకల్పించడం,ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - సామాజిక మౌలిక సదుపాయాలు, ఉపాధి, మానవాభివృద్ధి:
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం సామాజిక రంగాల వ్యయం జిడిపిలో 2020-21 సంవత్సరానికి , అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. - హెచ్డిఐ 2019లో ఇండియా ర్యాంకు 189 దేశాలలో 131 గా రికార్డు అయింది:
ఇండియా జిఎన్ ఐ తలసరిఆదాయం ( 2017 పిపిపి డాలర్లు)2018లో 6,427 అమెరికన్ డాలర్ల నుంచి2019లో 6,681 అమెరికన్ డాలర్లకు పెరిగింది.
-జననాలకు సంబంధించి ఆయుర్దాయం 2018లో 69.4 గా ఉండగా 2019కి అది 69.7 కు చేరింది.
-డాటా నెట్వర్క్,ఎలక్ట్రానిక్ పరికరాలైన కంప్యూటర్, లాప్టాప్,స్మార్ట్ఫోన్ తదితరాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.కోవిడ్ మహమ్మారికారణంగా ఆన్లైన్ చదువులు, ఇంటినుంచే పనిచేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
-2019 జనవరి – 2019 మార్చి మధ్య ( పిఎల్ఎఫ్ ఎస్ త్రైమాసిక సర్వే) శ్రమికులలో ప్రధాన వాటా రెగ్యులర్ వేతనదారులు, జీతాలు అందుకునేవారు ఉన్నారు.
-ఆత్మనిర్భర్ భారత్రోజ్గార్ యోజన కింద ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలాగే ప్రస్తుత లేబర్కోడ్లను నాలుగు కోడ్లుగా సులభతరంచేసింది. - ఇండియాలో తక్కువ స్థాయిలో మహిళా ఎల్ ఎఫ్ పి ఆర్:
– మహిళలు ఇంటి పనులకు, కుటుంబ సభ్యుల సంరక్షణ సేవలకు తమ పురుష భాగస్వాములతో పోలిస్తే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ( టైమ్ యూజ్ సర్వే 2019)
-పనిప్రదేశంలో వివక్ష లేకుండా వేతనాలు, కెరీర్లో ఎదిగే అవకాశాలలో వివక్ష లేకుండా పనినిమెరుగుపరిచే ప్రోత్సాహకాలు ఇతర వైద్య, సామాజిక భద్రతా ప్రయోజనాలను మహిళా వర్కర్లకు కల్పించడం.
– 2020 మార్చిలో ప్రకటించిన పిఎంజికెపి కింద ప్రస్తుతం వయోధికులు, వితంతువులు, దివ్యాంగులైన లబ్ధిదారులకు జాతీయ సామాజిక సహాయతా పధకంకింద వెయ్యిరూపాయల వరకు నగదు బదిలీ.
-ప్రధానమంత్రి జన్ధన్యోజన కింద మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలో 500 రూపాయల వంతున మూడు నెలలపాటు జమ చేయడం జరిగింది. దీని మొత్తం రూ 20.64 కోట్ల రూపాయలు.
– మూడు నెలల పాటు 8 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
-63 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు పూచీకత్తులేని ఉచిత రుణ సదుపాయ పరిమితిని 10 లక్షలర ఊపాయలనుంచి20 లక్షల రూపాయలకు పెంపు. ఇది 6.85 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుంది.
– మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం ఎం.ఎన్ ఆర్.ఇ.జి.ఎ కింద వేతనాలను 2020 ఏప్రిల్1 నుంచి20 రూపాయలు పెంచి రూ 182నుంచి 202 రూపాయలు చేయడం జరిగింది. - కోవిడ్ పై ఇండియా పోరాటం:
– ఆదిలోనే లాక్డౌన్కు సంబంధించినచర్యలు, సామాజికదూరం పాటించడం, ప్రయాణాలకు సంబంధించిన సూచలను, చేతులు శుభ్రంచేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖానికి మాస్కులు ధరించడంపై అవగాహన పెంపు వంటి వాటివల్ల కోవిడ్వ్యాప్తి గణనీయంగా తగ్గింది.
-అత్యావశ్యక మందుల విషయంలో దేశం స్వావలంబన సాధించింది. అలాగే చేతులు శుబ్రపరుచుకునే శానిటైజర్లు, రక్షణ పరికరాలు,మాస్కులు,పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు ,కోవిడ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ ఫెసిలీటలలో స్వావలంబన సాధించడం జరిగింది.
– ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమం 2021 జనవరి 16న ప్రారంభమైంది. దేశీయంగా తయారైన రెండు వాక్సిన్లను ఇందులో ఉ పయోగిస్తున్నారు.
PIB, January 29, 2021