కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లోని ముఖ్యాంశాలు:

బడ్జెట్ అంచనాలు 2024-25:
•రుణాలు మినహా మొత్తం రాబడి: ₹32.07 లక్షల కోట్లు.
•మొత్తం వ్యయం: ₹48.21 లక్షల కోట్లు.
•నికర పన్ను రాబడులు: ₹25.83 లక్షల కోట్లు.
ద్రవ్య లోటు: స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 4.9 శాతం.
•వచ్చే ఏడాదికల్లా ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యనిర్దేశం.
•ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో, స్థిరంగా 4 శాతం లక్ష్యం దిశగా సాగుతోంది; కీలక (ఆహారేతర, ఇంధనేతర) ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది.
•ఈ బడ్జెట్ ప్రధానంగా ఉపాధి, నైపుణ్యం, ‘ఎంఎస్ఎంఇ’లు, మధ్య తరగతిపై దృష్టి సారిస్తుంది.
ఉపాధి-నైపుణ్యం దిశగా ఐదు ప్రధానమంత్రి పథకాల ప్యాకేజీ
•రాబోయే ఐదేళ్ల కాలంలో దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి-నైపుణ్యం సహా ఇతరత్రా అవకాశాల కల్పన లక్ష్యంగా 5 ప్రధానమంత్రి పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీ:

1.పథకం ఎ – తొలి ఉద్యోగస్థులు: ‘ఇపిఎఫ్ఒ’లో నమోదు మేరకు తొలి ఉద్యోగంలోగల వారికి 3 వాయిదాలలో ఒక నెల జీతం గరిష్ఠంగా ₹15,000 వరకు అందుతుంది.
2.పథకం బి – తయారీ రంగంలో ఉపాధి సృష్టి: ఉద్యోగి-యజమాని రెండు పక్షాలకూ తొలి 4 ఏళ్ల ఉద్యోగ కాలంలో తమతమ వాటా ‘ఇపిఒఫ్ఒ’ చందా ప్రకారం నిర్దేశిత స్థాయిలో ప్రత్యక్ష ప్రోత్సాహకం.
3.పథకం సి – యాజమాన్యాలకు చేయూత: ప్రతి అదనపు ఉద్యోగిపై యాజమాన్య వాటా ‘ఇపిఒఫ్ఒ’ చందా నిమిత్తం 2 సంవత్సరాలపాటు ప్రభుత్వం నుంచి నెలకు ₹3,000 దాకా నగదు వాపసు.
4.నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం
•రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన
•దేశవ్యాప్తంగా కూడలి-కేంద్రం (హబ్ అండ్ స్పోక్) పద్ధతిలో 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)ల ఉన్నతీకరణ.
5.దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణార్థి ఉద్యోగ కల్పనకు కొత్త పథకం: దీనికింద రాబోయే ఐదేళ్ల కాలంలో 1 కోటిమంది యువతకు అవకాశం
‘వికసిత భారత్’ లక్ష్య సాధన కోసం బ‌డ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిపాదలను చేశారు.

1. వ్యవసాయంలో ఉత్పాదకత – ప్రతిరోధకత

•వ్యవసాయం, అనుబంధ రంగాలకు ₹1.52 లక్షల కోట్లు కేటాయింపు
•అధిక దిగుబడితోపాటు వాతావరణ ఒడుదొడుకులను తట్టుకోగల 32 రకాల సాధారణ-ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల కోసం 109 కొత్త వంగడాల ఆవిష్కరణ.
•ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరించేలా రాబోయే 2 సంవత్సరాల్లో ధ్రువీకరణ-బ్రాండింగ్‌తో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు ప్రోత్సాహం.
•ప్రకృతి వ్యవసాయం కోసం దేశవ్యాప్తంగా 10,000దాకా ‘అవసరం ఆధారిత’ జీవ ఉత్పాదక వనరుల కేంద్రాలు ఏర్పాటు
•రాబోయే మూడేళ్లలో వ్యవసాయ రంగం, రైతుల కోసం మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాలు (డిపిఐ) అమలు.

2. ఉపాధి – నైపుణ్య కల్పన

•ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా తొలిసారి ఉద్యోగులకు, తయారీ రంగంలో ఉద్యోగ సృష్టికి, యాజమాన్యాలకు చేయూతనివ్వడానికి ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం’ పథకాలను అమలు చేయనున్నారు.
•కార్మికశక్తిలో మహిళల అధిక భాగస్వామ్యం దిశగా సౌలభ్య కల్పన
oపారిశ్రామిక రంగ సహకారంతో ఉద్యోగినుల వసతి గృహాలు, క్రెష్‌ల‌ ఏర్పాటు
oమహిళలకు నైపుణ్య కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
oమహిళా స్వయం సహాయ సంస్థల కోసం మార్కెట్ సౌలభ్యం కల్పనకు ప్రోత్సాహం
oప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఐదేళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం.
oఆదర్శ నైపుణ్య రుణ పథకం మార్గదర్శకాల సవరణ ద్వారా ₹7.5 లక్షలదాకా రుణ సహాయం.
oప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద ఎలాంటి ప్రయోజనం పొందని యువతకు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ₹10 లక్షలదాకా రుణం ద్వారా ఆర్థిక తోడ్పాటు.

3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి – సామాజిక న్యాయం

•అమృత్‌సర్-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్ స‌హా గయ వద్ద పారిశ్రామిక మండళ్ల ఏర్పాటు.
•పిరపైంటిలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుదుత్పాదన కేంద్రం సహా ₹21,400 కోట్లతో మరికొన్ని విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు.
•మహిళలు, బాలికల ప్రయోజనార్థం వివిధ పథకాల అమలుకు ₹3 లక్షల కోట్లకుపైగా నిధుల కేటాయింపు
•ప్రధానమంత్రి గిరిజన గ్రామీణోద్ధరణ కార్యక్రమం (పిఎంజెయుజిఎ)
•గిరిజన ప్రాబల్యంగల, ఆకాంక్షాత్మక జిల్లాల్లో గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి; మొత్తం 63,000 గ్రామాల్లో 5 కోట్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం.
•ఈశాన్య భారత ప్రాంతంలో మొత్తం 100 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు శాఖల ఏర్పాటు.

4. తయారీ – సేవలు

•యంత్రాలు, యంత్ర పరికరాల కొనుగోలు కోసం ‘ఎంఎస్ఎంఇ’లకు పూచీకత్తు లేదా మూడో పక్షం హామీ లేకుండా నిర్దిష్ట వ్యవధిగల రుణహామీ పథకం.
•సంక్లిష్ట సమయాల్లో ‘ఎంఎస్ఎంఇ’లకు రుణ చేయూత
•సంక్లిష్ట సమయాల్లో ‘ఎంఎస్ఎంఇ’లకు బ్యాంకు రుణాల కొనసాగింపు సౌలభ్యం కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు.
•ముద్ర రుణాల్లో ‘తరుణ్’ విభాగం కింద మునుపటి వాయిదాలు సకాలంలో చెల్లించిన వారికి తాజా రుణ పరిమితి ₹10 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంపు.
•ఆహారంలో రేడియో ధార్మికత తొలగింపు, నాణ్యత-భద్రత పరీక్ష ‘ఎంఎస్ఎంఇ’ యూనిట్లు
•‘ఎంఎస్ఎంఇ’లు, సంప్రదాయ కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ విప‌ణిలో విక్రయించుకునే సౌల‌భ్యం కల్పిస్తూ ప్ర‌భుత్వ-ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పిపిపి)తో ఇ-కామర్స్ ఎగుమతి కూడ‌ళ్ల ఏర్పాటు.
•కీలక ఖనిజాల దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ సహా విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల సమీకరణ లక్ష్యంగా కీలక ఖనిజాల వ్యవస్థ ఏర్పాటు.
•తీరప్రాంతంలో ఖనిజ క్షేత్రాల అన్వేషణ, ప్రస్తుత గనుల తవ్వకం సంబంధిత తొలివిడత వేలం ఇప్పటికే పూర్తి
•మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాల (డిపిఐ) అనువర్తనాలు
•రుణాలు, ఇ-కామర్స్, విద్య, ఆరోగ్యం, చట్టం-న్యాయం, రవాణా, ‘ఎంఎస్ఎంఇ’, సేవల ప్రదానం సహా పట్టణ పాలన రంగాల కోసం ‘డిపిఐ’ అనువర్తనాల రూపకల్పన.

5. పట్టణాభివృద్ధి

•దేశంలో 30 లక్షలకు మించి జనాభాగల 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు- వ్యూహాల రూపకల్పన-అమలు, ఆర్థిక సహాయం.
•రాబోయే ఐదేళ్ల‌లో 1 కోటి పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల గృహావస‌రాలు తీర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ప‌ట్ట‌ణ 2.0 కింద కేంద్ర సాయంగా ₹2.2 ల‌క్ష‌ల కోట్లు స‌హా ₹10 లక్షల కోట్ల పెట్టుబడికి ప్ర‌తిపాద‌న‌.
•రాబోయే ఐదేళ్లపాటు దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో ఏటా 100 వారాంతపు ‘హాత్’ లేదా వీధి ఆహార కూడళ్ల ఏర్పాటుకు మద్దతుగా కొత్త పథకం.

6. ఇంధన భద్రత

•ఉపాధి, వృద్ధి, పర్యావరణ సుస్థిరతల ఆవశ్యకత సమతౌల్యం లక్ష్యంగా ‘ఇంధన పరివర్తన పరిష్కారాల’పై విధాన పత్రం రూపకల్పన.
•‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్’ పరిశోధన-అభివృద్ధి సహా అణు విద్యుత్తు, భారత చిన్న రియాక్టర్ల సాంకేతికతల కోసం ప్రైవేట్ రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం.
•‘రద్దు శక్యంకాని’ పరిశ్రమలను ప్రస్తుత ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ విధానం నుంచి ‘ఇండియన్ కార్బన్ మార్కెట్’ విధానంలోకి మార్చేందుకు తగిన నిబంధనల రూపకల్పన.

7. మౌలిక సదుపాయాల కల్పన

•మూలధన వ్యయం కోసం 11,11,111 కోట్ల రూపాయలు (జిడిపిలో 3.4 శాతం) సమకూర్చడం జరుగుతుంది.
•మౌలిక సదుపాయల రంగంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలకు గాను 1.5 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చడం జరుగుతుంది.
•అన్ని కాలాల్లో 25,000 గ్రామీణ జనావాసాలకు సంధానాన్ని సమకూర్చడం కోసం పిఎమ్ జిఎస్ వై లో నాలుగో దశను ప్రారంభించడం జరుగుతుంది.
•బిహార్ లో కోసీ-మేచీ అంతర్ రాష్ట్ర లంకెతో పాటు, ఇతర పథకాల కోసం 11,500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
•వరదలు, కొండచరియలు విరిగి పడడం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అసోమ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిమ్ లకు ప్రభుత్వం సహాయాన్ని సమకూర్చుతుంది.
•విష్ణుపాద టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్, రాజ్ గీర్ లను సంపూర్ణగా అభివృద్ధి పరచడం జరుగుతుంది.
•ఒడిశాలో దేవాలయాలు, కట్టడాలు, చేతివృత్తులు, వన్యప్రాణి అభయారణ్యాలు, సముద్రతీర ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

8.ఆవిష్కరణ.. పరిశోధన-అభివృద్ధి

•ప్రాథమిక పరిశోధన, ప్రోటోటైప్ వికాసం కోసం ఉద్దేశించిన అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫండ్ కార్యకలాపాలను ఆరంభించడం జరుగుతుంది.
•వాణిజ్య సరళిలో ప్రైవేటు రంగం చోదక శక్తిగా ఉండే పరిశోధనలు, నూతన ఆవిష్కారాలకు ఊతాన్ని ఇవ్వడం కోసం ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ప్రధాన వనరుల సమీకరణ.
•వచ్చే పదేళ్ళలో అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థను అయిదింతలు విస్తరించడం కోసం ఒక వేయి కోట్ల రూపాయల వెంచర్ కేపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

9. భవిష్యత్తరం సంస్కరణలు

•అన్ని భూములకు భూ-ఆధార్ లేదా యునీక్ లాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్ పిఐఎన్)
•భూమి లెక్కల చిత్రపటాల డిజిటలీకరణ
•ప్రస్తుత యాజమాన్య ఆధారిత మ్యాప్ సబ్ డివిజన్ ల సర్వే
•భూమి రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం
•పట్టణ ప్రాంతాలలో భూమికి సంబంధించిన రికార్డులను జిఐఎస్ మేపింగ్ దన్నుతో డిజిటలీకరణను చేపట్టడం

కస్టమ్స్ సుంకం ప్రతిపాదనలు

•మూడు కేన్సర్ మందులను కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించడమైంది. ఆ మందులలో త్రాస్టూజుమాబ్ డెరుక్స్ టెకాన్, ఆసిమెర్తినిమ్ మరియు డూర్వాలుమాబ్ (TrastuzumabDeruxtecan, Osimertinib and Durvalumab) లు ఉన్నాయి.
•వైద్య చికిత్సకు ఉపయోగించే ఎక్స్-రే యంత్రాలకు సంబంధించిన ఎక్స్-రే ట్యూబ్ లు, ఫ్లాట్ పానల్ డిటెక్టర్ ల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బిసిడి) లో మార్పులు.
•మొబైల్ ఫోన్, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ) లపై మరియు మొబైల్ చార్జర్ లపై బిసిడి 15 శాతానికి తగ్గించడమైంది.
•బంగారం, వెండి లపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గించడమైంది; ప్లాటినమ్ పై 6.4 శాతానికి తగ్గించడమైంది
•ఫెర్రో నికెల్ పై, దుక్క రాగి పై బిసిడి ని తొలగించడమైంది.
•ఫెర్రస్ స్క్రాప్ పై, నికెల్ కాథోడ్ పై బిసిడి ని తొలగించడమైంది.
•రాగి తుక్కు పై 2.5 శాతం ప్రత్యేక బిసిడి
•నిర్దిష్ట టెలికం సామగ్రికి సంబంధించిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ) పై బిసిడిని 10 శాతం మించి 15 శాతానికి పెంచడమైంది.
•దేశీయ విమాన యానాన్ని పడవల, నౌకల ఎమ్ఆర్ఒ ప్రక్రియను ప్రోత్సహించడం కోసం మరమ్మత్తులకై దిగుమతి చేసుకొన్న వస్తువుల ఎగుమతి కాలావధిని ఆరు నెలల నుంచి ఒక ఏడాదికి పొడిగించడమైంది.
•25 క్రిటికల్ మినరల్స్ ను కస్టమ్స్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయించడమైంది
•రెండు క్రిటికల్ మినరల్స్ పై బిసిడిని తగ్గించడమైంది.
•సోలార్ సెల్స్, పేనల్స్ తయారీలో ఉపయోగించే కేపిటల్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడమైంది
•చిన్న రొయ్యలు, చేపల మేత తయారీకి ఉపయోగించే వివిధ ఇన్ పుట్స్ ను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించడమైంది.

ప్రత్యక్ష పన్నులు

•2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్నుల విధానాన్ని సరళీకరించిన ఫలితంగా కార్పొరేట్ పన్నులో 58 శాతం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించిన సరళీకరించిన పన్ను విధానాన్ని మూడింట రెండు వంతులకు పైగా పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవడమైంది.
•దానశీల సంస్థలకు వర్తించే రెండు రకాల పన్ను మినహాయింపు విధానాలను ఒకే అంశంగా కలిపివేయడమైంది.
•అనేక చెల్లింపులపై అమలవుతున్న 5 శాతం టిడిఎస్ రేటును 2 శాతం టిడిఎస్ రేటులోకి విలీనం చేయడమైంది.
•మ్యూచువల్ ఫండ్ లు లేదా యుటిఐ యూనిట్ లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వర్తించే 20 శాతం టిడిఎస్ రేటును ఉపసంహరించుకోవడమైంది.
•ఇ-కామర్స్ ఆపరేటర్ లకు వర్తిస్తున్న టిడిఎస్ రేటును ఒక శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించడమైంది.
•స్టేట్ మెంట్ ను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన గడువు తేదీ వరకు టిడిఎస్ చెల్లింపులో జాప్యం చేయడాన్ని ఇకపై అపరాధ పూర్వక చర్యగా పరిగణించడం జరుగదు.
•లెక్కలలో చూపని ఆదాయం 50 లక్షల రూపాయలు గాని, లేదా అంతకన్నా ఎక్కువ గాని ఉన్నప్పుడు మాత్రమే నిర్ధారణ (అసెస్ మెంట్)ను అసెస్ మెంట్ ఇయర్ ముగిసినప్పటి నుంచి మూడేళ్ళు దాటిన తరువాత అయిదేళ్ళ వరకు తిరిగి తెరవవచ్చు.
•సోదా జరపవలసి వచ్చిన వ్యవహారాలలో కాల పరిమితిని సోదాను చేపట్టిన సంవత్సరానికి పూర్వం పది సంవత్సరాలుగా ఉండగా, దానిని ఆరు సంవత్సరాలకు తగ్గించడమైంది.
ఉపాధి కల్పన, పెట్టుబడి
•స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్ ను ప్రోత్సహించడం కోసం అన్ని విధాలైన ఇన్వెస్టర్ లకు ఏంజల్ టాక్స్ ను విధించే పద్ధతిని రద్దు చేయడమైంది.
•దేశీయ విహారాల కార్యకలాపాలను నిర్వహిస్తున్న విదేశీ నౌకాయాన వ్యాపార సంస్థలకు సులభతర పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడమైంది. భారతదేశంలో సముద్రయాత్ర ప్రధానమైన పర్యటన రంగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయంలోని ప్రధానోద్ధేశ్యం.
•దేశంలో ముడి వజ్రాలను విక్రయిస్తున్న విదేశీ మైనింగ్ కంపెనీలకు రక్షణ ప్రధానమైన రేటులను వర్తింప చేయడం జరుగుతుంది.
•విదేశీ వ్యాపార సంస్థలకు విధించే కార్పొరేట్ పన్ను రేటును 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించడమైంది.

తేటగీతి, జూలై 24, 2024