పద్య సౌరభం

పద్య సౌరభం

మాలకరి పుష్పములు గోయు మాడ్కిఁ దేఁటి పువ్వుఁదేనియఁ గొనియెడి పోల్కి నెదురు గందకుండఁగఁ గొనునది కార్యఫలము బొగ్గులకుఁ బోలె మొదలంటఁ బొడువఁజనదు. భావం: ఎదుట వ్యక్తి నుండి ప్రయోజనం ఆశించినవాడు వానికి హాని కలగకుండా మృదువుగా ఆ ప్రయోజనాన్ని సాధించాలన్నదే ఈ పద్యం యొక్క ఉద్దేశం. పుష్పాలతో మాలలు తయారు చేసేవాడు పువ్వులను కోసినట్టు, తుమ్మెద పుష.....
సకలాకరుడు ఁడనంతుఁడు సకలాత్మలయందు సర్వసాక్షియు తానై సకలమున నిర్వికారుం డకలంక స్థితిని బ్రహ్మమని బడువేమా భావం: ‘సర్వం విష్ణుమయం జగత్’ అను ఉపనిషత్ సిద్ధాంతాన్ని తేటతెల్లపర్చే పద్యమిది. అంతటా వ్యాపించియున్న సర్వాంతర్యామి, పరిపూర్ణమైన పరబ్రహ్మ ఒక్కడే. సకల చరాచర జగత్తులో వ్యాపించి, సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడేనన్న మూలతత్త్వాన.....
ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కక్కండై తోఁచు పో లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ న్య కదంబంబుల హ్యత్సరోరుహములన్ నానావిధానూనరూ పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁబ్రార్ధింతు శుద్ధుండనై భావం: సూర్యుడు ఒక్కడే. అయినా లోకంలోని సకలజీవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కన్పిస్తాడు. అట్లే పరమాత్ముడు ఒక్కడే అయినా సర్వకాలాల.....
వెలఁది జూదంబు పానంబు వేఁట పలుకు ప్రల్లదంబును దండంబుఁ బరుసదనము. సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల భావం: స్త్రీ సాంగత్యం, జూదం, మద్యపానం, వేట, కఠినంగా మాట్లాడడం, అతిపరుషమైన దండన విధించడం, ధనాన్ని ఏ మాత్రం ప్రయోజనం లేకుండా వ్యయం చేయడం అనేవి ఏడూ సప్తవ్యసనాలు. ...
గుడి కూలును నుయి పూడును వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్ చెడనిది పద్యం బొకటియె కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా! భావం: గుడి కూలిపోవచ్చు. నూతిలో, చెరువులో నీరు ఇంకవచ్చు. వనాలు నాశనమూ కావచ్చు. ఎప్పటికి చెడకుండా కీర్తి బావుటాను ఎగరవేయునది పద్యమోకటే. ...
విత్తంబు విద్య కులము న్మత్తులకు మదంబొసంగు; మాన్యులకున్ స ద్వృత్తి నొసంగున్ వీనిన్ జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా‌ భావం: ధనం, గొప్ప విజ్ఞాన, సద్వంశం దుర్మార్గులకు గర్వాన్ని కలిగిస్తుంది. ఈ త్రిగుణాలే సజ్జనులకు మంచిని కలుగుచేస్తాయి. వీటిని గుర్తించుకొని ప్రవర్తించుము. ...
క్షమయ జనుల కాభరణము, క్షమయ కీర్తి క్షమయ ధర్మంబు, క్షమయ సజ్జనగుణంబు క్షమయ యజ్ఞంబు, క్షమయ మోక్షంబు, క్షమయ సకలదానంబు, క్షమయందె జగము నిలుచు భావం: ప్రజలకు భూషణము క్షమయే అనగా సహనం. పాటించదగిన ధర్మము, సజ్జనులలోని ఉత్తమగుణం క్షమయే. ఈ లోకమంతా క్షమ అన్న ఒక్క గుణంపై ఆధారపడి నిలిచియున్నది. అందువలనే మనిషి సహానాన్ని అలవర్చుకుని ఓర్పుతో జీవనం సాగించ.....
జుఱ్ఱెదమీ కథామృతము, జుఱ్ఱెద మీపదకంజ తోయమున్ జుఱ్ఱెద రామనామమున బొబ్బిలుచున్న సుధారసంబు,నే జుఱ్ఱెద జుఱ్ఱు జుఱ్ఱుఁన రుచుల్ గనువారి పదంబుగూర్బ వే తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ భావం: నీ కథలనే విని, నీ పాదపద్మములను కడిగిన నీటిని తాగెదను. నిత్యము నీయందె భక్తి నిలిపి నీ లీలల యందే నాధ్యాస నుంచి నీ భక్తుల తోనే నాకు సహవాస మొనర్చుము.....
ఆదిజుఁడైన బ్రహ్మ యుదయంబున కాస్పదమైనవాఁడు వే దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసింతుఁడైనవాఁడు లో కాది త్రిలోకపూజ్యుఁడని యాత్మ నెఱింగి పితామహూండు దా మోదరుఁజెప్పెఁబూజ్యుడని యుక్తమ కాకిది యేమి దోసమే బ్రహ్మదేవుని పుట్టుకకు స్థానమైనవాడు, వేదాలు మున్నగు సకల వాఙ్మయాలలో కీర్తింపబడినవాడూ, లోకానికంతటికి ఆది అయినవాడు, మూడులోకాలలో పూజింపదగ.....
కొందఱికిఁ దెనుఁగు గుణ మగుఁ గొందఱికిని సంస్కృతంబు గుణ మగు రెండున్ గొందఱికి గుణము లగు నే నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్   కావ్యమంటే సంస్కృత కావ్యమే. పాండిత్యమంటే సంస్కత పాండిత్యమే అని భావించే నాడు కూడా తాను ఉభయకావ్యకరణదక్షుడ నని పోతన సగర్వంగా, సవినయంగా తెలియచేసిన పద్యమిది. సంస్కృత భాష భూయిష్ఠ రచన అందరికి అందుబాటులో ఉండదని పాల.....
అదిమి మనసు నిలిపి ఆనందకేళిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు జిహ్వరుచులచేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినుర వేమ భావం: మనస్సును నిలకడగా నిలిపి ఆనందపరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేక పోవడం వలన మనిషి చెడిపోతాడు. ...
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ! భావం: ఎవరు ఏమి చెప్పినా వినవచ్చును. అయితే విన్నవెంటనే తొందరపడకుండా, విషయాన్ని అవగాహన చేసుకొని, బాాగా ఆలోచించి నిజానిజాలు గ్రహించగలిగినవాడే నీతిపరుడని బద్దెన ఈ పద్యంలో వివరించాడు. ...